కేటీఆర్ తో అసదుద్దీన్‌ ఓవైసీ భేటీ

SMTV Desk 2019-03-11 07:17:22  ktr, mim party, trs, asadiddun owaisi

హైదరాబాద్, మార్చ్ 10: ఆదివారం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై వారు చర్చించారు. టిఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షం అన్న విషయం తెలిసిందే. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు తెలిపింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానల్లో పోటీ చేస్తుండగా, హైదరబాద్ స్థానంలో ఎంఐఎం పోటీ చేయనుంది. టిఆర్ఎస్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో అసదుద్దీన్ పాల్గొననున్నారని తెలుస్తోంది.