హైదరాబాద్, ఆగస్ట్ 7 : అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా ప్రతీ సోదరి తన సోదరులు రక్షగా ఉండాలని, కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కడుతుంది. రక్షా బంధన్ ప్రాముఖ్యత కూడా ఇదే. అయితే దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా కవిత కేటీఆర్కు హెల్మెట్ను బహుమతిగా ఇచ్చారు. కాగా కేటీఆర్ కవితకు చేనేత చీరను బహుకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సమాజంలో మహిళల రక్షణకు వారి సంక్షేమ వృద్ధికి బాటలు వేసేదిగా ఉండాలని ఈ రోజున మనమంతా సంకల్పం చేయాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేసారు.