లండన్, మార్చ్ 10: లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఖలీస్తాన్ మద్దతుదారులు భారతీయులపై అతి కిరాతంగా దాడి చేశారు. దీంతో హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత హైకమిషన్ ముందు యూకే బేస్డ్ కశ్మీర్, ఖలిస్తాన్ మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు ఘర్షణకు దారి తీశాయి. భారత్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భారతీయులు ప్రతిఘటించడంతో వివాదం చెలరేగింది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్ మద్దతుదారులు, ఇండియా సొసైటీ ఫ్రెండ్స్ మధ్య ఈ వివాదం జరిగింది.