ఇంగ్లండ్ క్లీన్ స్వీప్

SMTV Desk 2019-03-10 15:02:34  England,

గౌహతి: ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళలు పరాయజం పాలయ్యారు. ఇంగ్లండ్ విధించిన 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగలు చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో భారత మహిళ ఓటమి చవిచూశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బిమౌంట్ (29), జోన్స్(26), వ్యాట్(24) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్, డియోల్ తలో రెండు వికెట్లు… బిస్త్, పునమ్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 118 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మందన అర్ధశతకం(58)తో రాణించగా, మిథాలీ రాజ్(30 నాటౌట్) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్ ఉమెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివరి ఓవర్ లో విజయానికి కేవలం 3 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులు పరుగులేమి రాలేదు. ఆ తరువాత నాల్గు, ఐదు బంతులకు వరుసగా ఇద్దరు పెవిలియన్ చేరారు. చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో భారత్ ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ మూడు టీ20 మ్యాచుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.