మొహాలీ వన్డే ... బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

SMTV Desk 2019-03-10 15:01:45  Mohali , India,

మొహాలి, మార్చ్ 10: మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఎంఎస్ ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా స్థానంలో చాహాల్, రాయుడు స్థానంలో కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చారు. ఇక రాబోయే వరల్డ్ కప్ దృష్ట్యా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మూడు వన్డేలో భారత్ రెండు గెలిస్తే, కంగారులు ఒకటి గెలిచారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది. మరోవైపు ఆసీస్ జట్టు మూడో వన్డే విజయంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సమం చేయాలని బరిలోకి దిగుతోంది.