బిజెడిలో చేరిన సునీతా బిశ్వాల్

SMTV Desk 2019-03-10 14:58:10  bjd, sunitha biswal

భువనేశ్వర్ : ఒడిశా మాజీ సిఎం, కాంగ్రెస్ అగ్రనేత హేమానంద బిశ్వాల్ కూతురు సునీతా బిశ్వాల్ అధికార బిజూ జనతాదళ్(బిజెడి)లో చేరారు. బిజెడి చీఫ్, సిఎం నవీన్ పట్నాయక్ నివాసంలో సునీతా బిశ్వాల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ నబా కిశోర్ దాస్ కూడా గత నెలలో బిజెడిలో చేరారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై, తాను బిజెడిలో చేరినట్టు సునీతా బిశ్వాల్ తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవీన్ పట్నాయక్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఆమె ప్రశంసించారు. అయితే సునీతా తండ్రి , మాజీ సిఎం హిమానంద మాత్రం తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు.