విమానంలో కొట్లాట.. 30 మందికి గాయాలు

SMTV Desk 2019-03-10 14:57:10  Eroplane

న్యూయార్క్: విమానం గాల్లో నడిసముద్రంపై ఉండగా అందులో ప్రయాణిస్తున్న సుమారు 326 ప్రయాణికులు రెండు గ్రూపులుగా విడిపోయి చితక్కొట్టుకున్నారు. దీంతో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విమషమంగా ఉండగా, ఒకరి కాళ్లు విరిగాయి. ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ కు వెళ్తున్న టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్-777 విమానం లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకో గంటలో న్యూయార్క్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాల్సి ఉండగా విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. దీంతో ప్రయాణికులంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విమానంలో హాహాకారాలు చెలరేగాయి. దీంతో పైలట్ విమానాన్ని న్యూయార్క్ లోని కెన్నడీ విమానాశ్రయంలో అత్యావసరంగా ల్యాండ్ చేశారు. కాగా, సంబంధిత ఎయిర్ లైన్స్ అధికారులు ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.