కొలంబియాలో విమానం కూలి 12 మంది మృతి

SMTV Desk 2019-03-10 14:17:22  eroplance,

బొగోటా : విమానం కూలి 12 మంది ప్రయాణికులు మృతి చెందిన సంఘటనా కొలంబియాలో చోటు చేసుకుంది. డగ్లస్‌ డీసీ-3 విమానం శాన్‌జోస్‌ డెల్‌ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో తరారీయా, డోరిస్‌ గ్రామాల మేయర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. విమాన ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.