కాకినాడ, ఆగష్ట్ 7: కాకినాడ నగరపాలక సంస్థలో కార్పోరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఇందులో భాగంగా నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని నగరపాలక కమీషనర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాటులను ఇప్పటికే పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. కొత్తగా విలీనమైన మూడు గ్రామాలకు చెందిన 2డివిజన్లు మినహా మిగతా 48డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మూడు డివిజన్లకు ఒకరు చొప్పున 17మంది రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. కాగా, ఎన్నికలు ఈ నెల 29న నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీలన్ని అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి.