అమరావతి, మార్చి 10: వైసీపీ సమర శంఖారావం సభ వాయిదా పడింది. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పూర్తిచేసిన తరువాత ప్రతి జిల్లాకు సమరశంఖారావం సభకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారం విజయవాడ పట్టణం రామవరప్పాడులో ఈనెల 13వ తేదీన సభ జరగాల్సి ఉండగా దీనిని వాయిదా వేశారు. ఈ సభను మరునాటికి అంటే 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు కారణాలను మాత్రం తెలుపలేదు. ఆ రోజు సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం(11న) నిర్వహించాల్సిన సభ యథావిధిగా సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.