సైనికుల త్యాగాలాను ప్రచారాల్లో వాడొద్దు

SMTV Desk 2019-03-10 11:44:22  Election Commission, Lok Sabha, Polls, Soldiers, Sympathy, Campaign

న్యూఢిల్లీ, మార్చి 10: పుల్వామా ఉగ్రదాడిలో అమరారులైన సైనికుల త్యాగాలాను రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో వినియోగించుకోవద్దని ఎన్నికల సంఘం సూచించింది. ఎవరైనా వారి త్యాగాలనుగాని, సైనికుల ఫొటోలనుగాని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్నీ రాజకీయ నాయకులూ తమ కార్యకర్తలకు స్పష్టం గా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్, బీజేపీ నాయకులతో కూడిన హోర్డింగ్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ హోర్డింగ్‌ ఎక్కడ ఏర్పాటుచేశారో తెలియరాలేదు. ప్రచార చిత్రాలు, హోర్డింగ్‌లలో సైనిక సిబ్బంది ఫొటోలు లేకుండా చూడాలని 2013లోనూ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. సైనికుల ఫొటోలను రాజకీయ నాయకులు, పోటీచేస్తున్న అభ్యర్థులు వాడుకుంటున్నారని, ఈ పోకడను నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అప్పట్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈసీని కోరింది.