కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి

SMTV Desk 2019-03-10 09:35:39  central government, bjp, unemployment, ex central minister p chidanbaram

న్యూఢిల్లీ, మార్చ్ 09: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేంద్ర సర్కార్ ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైందని, అలాగే రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యే కీలక అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రచారాల్లోని అవాస్తవాలను భారత పరిశ్రమల శాఖ బయటపెట్టిందని ఆయన అన్నారు. దీనిపై మిగిలిన వారు సైతం గళం వినిపించాల్సి అవసరం ఉందన్నారు. ప్రైవేటు రంగం నుంచి కొత్త పెట్టుబడులు రావడం లేదని తెలిపింది. గిరాకీ తగ్గడంతో పాటు, తయారీ రంగం డీలా పడడం ఇందుకు కారణమని సిఐఐ అధ్యక్షుడు రాకేశ్‌ భారతి మిట్టల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 6-16 ఏళ్ల మధ్య ఉన్న వారికి పదేళ్ల తరవాత ఉద్యోగం కల్పించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.