ముంబై, మార్చ్ 09: ఎస్సార్ స్టీల్ టేకోవర్కు బ్రిటన్ ఉక్కు సంస్థ ఆర్సిలర్ మిట్టల్ అధినేత లక్ష్మీమిట్టల్ దాఖలు చేసిన ఉత్తర్వులను లాట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. 50 వేల కోట్లతో ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు మిట్టల్ బిడ్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్సిఎల్టి అహ్మదాబాద్ ఆర్సిలర్ మిట్టల్ ఈ ఉత్తర్వులను స్వాగతించారు. కాని ఎస్సార్ స్టీల్ మాత్రం తమ ఒప్పంద పరిష్కారం 54,389 కోట్లుగా ఉంటుందని చెపుతోంది. ఏడాదిపాటు జరిగిన న్యాయపరమైన పోరాటాలతో బిడ్డర్లు, కోర్టులు, బ్యాంకులు విసిగిపోయాయి. చివరకు ఎన్సిఎల్టికి బకాయిలను రాబట్టుకునేందుకు ఉపక్రమించడంతో అర్సిలర్ మిట్టల్ పరిష్కార ప్రణాళికకు ఆమోదం లభించింది.