రాంచీ, మార్చ్ 09: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని స్థానిక పార్టీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజెఎన్యూ)తో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయం బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ తెలిపారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ లోక్సభ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది. మొత్తం రాష్ట్రంలో 14 స్థానాలుండగా, బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఏజెఎన్యూ ఒక స్థానంలో పోటీ చేస్తుందని పేర్కొంది.