హైదరాబాద్, ఆగస్ట్ 7 : తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. తగినంత విశ్రాంతి తీసుకొని, పూర్తిగా కోలుకున్న తర్వాతనే విధులకు హాజరు కావాలని సూచించారు. కాగా, రెండురోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురై జ్వరంతో పాటు రక్తపు వాంతులు, రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటుచేసుకుని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.