ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ లో పోరాడి ఓడిన సైనా

SMTV Desk 2019-03-09 16:09:40   All England Championships quarters, Sania Nehwal,

హైదరాబాద్, మార్చ్ 09: శుక్రవారం బర్మింగ్‌ హోమ్ లో జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ లో సైనా ఓడిపోవడంతో ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత్‌ పోరాటం వృథా అయింది. 15-21, 19-21తో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. దీంతో ముఖాముఖి రికార్డులో 5-15తో వెనుకంజలో ఉన్న సైనాకు తై జు చేతిలో వరుసగా ఇది 13వ ఓటమి మూటగట్టుకుంది. తన వ్యూహాలకు పదును పెట్టిన సైనా ప్రత్యర్థిని కోర్టులో పరిగెట్టేలా చేసి 12-14తో స్కోరు అంతరాన్ని తగ్గించింది. కానీ ఈలోపే తై జు మళ్లీ పుంజుకుని.. క్రమంగా పాయింట్లు సాధించింది. దీంతో తొలి గేమ్‌ ను 21-15తో సొంతం చేసుకుంది.