న్యూయార్క్, మార్చ్ 09: టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్ పద్మాలక్ష్మిని ఐక్యరాజ్యసమితి తన అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. పద్మాలక్ష్మిని గుడ్విల్ అంబాసిడర్గా నియమిస్తూ యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్విల్ అంబాసిడర్గా నియమించినందుకు సంతోషంగా ఉందన్న ఆమె.. అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడంపై ఫోకస్ చేస్తానంటోంది. ప్రపంచంలో అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది.