ఏప్రిల్ 12న మెగా హీరో సినిమా

SMTV Desk 2019-03-09 16:00:01  Chitralahari,

హైదరాబాద్, మార్చ్ 09: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా చిత్రలహరిని ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టైటిల్ లోగాను శనివారం విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జవాన్‌’ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా ఇది కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ‘జవాన్‌’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా హీరో రామ్‌-కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను-శైలజ’ సినిమాకు తొలుత ‘చిత్రలహరి’ అనే టైటిల్ ను పరిశీలించారు. అయితే, అనేక చర్చల అనంతరం ఆ సినిమాకు ‘నేను-శైలజ’ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాకు చిత్రలహరి టైటిల్ ను పెట్టారు. ఈ సినిమా ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.