ఢిల్లీ: ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి సోదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మొత్తం 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఉన్న ఆఫీసు,ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.