అమరనాథ్ యాత్రికుల బస్సు దాడి కేసులో ముగ్గురు అరెస్ట్

SMTV Desk 2017-08-06 18:10:08  Terrorists attack on amar nadh bus, AMARNATH PILGRIMS , FIRING CASE , THREE ACCUSED , JAMMU KASHMIR , ANANTHNAG DISTRICT , BATING AREA , TERRORISTS , AMARNATH ATTACK ,

జమ్ము, ఆగష్ట్ 6: ఒక ప్రక్క నుంచి భారత రక్షక దళాలు ఉగ్రవాదులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న దేశంలో ఏదో ఒక మూల ఉగ్ర నీడ పడుతూనే ఉంది. జూలై 10న అనంత్‌నాగ్ జిల్లాలో బటింగ్ ప్రాంతంలో అమర్‌నాథ్ వెళ్తున్న యాత్రికుల బస్సును టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15మంది గాయాలపాలయ్యారు, ఏడుగురు మృతి చెందారు. తాజాగా ఈ దాడి కేసుకు సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ము పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురూ లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.