ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని కృష్ణ మురళీ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ క్రమంలో వర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పిన పోసాని, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇక చంద్రబాబును పరోక్షంగా ఎటాక్ చేశారు పోసాని. నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా.. ఎవడైతే వెధవ వేషాలు వేస్తాడో వాడికే కష్టాలు, కన్నీళ్లు, కోపాలు వస్తాయని… అవినీతి పనులు చేసిన వాడు, వెన్నుపోటు పొడిచిన వాడే బాధ పడుతుంటాడని.. నువ్వు ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వంలోనూ, రాజకీయాల్లో ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎందుకు విడిచిపెడతాడంటూ పోసాని కృష్ణ మురళీ చంద్రబాబు పై ఇండైరేక్ట్ గ వ్యాఖ్యలు చేశారు. మరి పోసాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.