ఎమ్మెల్సీ అభ్యర్ధి గౌడ్‌కు తెరాస మద్దతు

SMTV Desk 2019-03-09 11:28:23  trs,

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు తెరాస మద్దతు ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా టి. జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాల నుంచి పోటీ చేసిన ఆయనను ఓడించి పంతం నెగ్గించుకొన్న తెరాస ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆయనను మరోమారు ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని ముగించేలా చేయాలని యోచిస్తోంది. ఆ లక్ష్యంతోనే స్థానికంగా మంచి పేరున్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు తెరాస మద్దతు ప్రకటించింది. అంతేకాదు...తెరాస అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు ఎం.సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్ రంగంలో దిగి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న ఇతర అభ్యర్ధులకు నచ్చజెప్పి నామినేషన్లు ఉపసంహరింపజేసినట్లు సమాచారం. వారిరువురూ చంద్రశేఖర్ గౌడ్‌ను గెలుపుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయనకు తెరాస మద్దతు, అండదండలు లభిస్తున్నాయి కనుక దాదాపు సగం విజయం సాధించినట్లే భావించవచ్చు.