విరాట్ కోహ్లీ వీరవిహారం

SMTV Desk 2019-03-09 10:18:36  Virat kohli,

రాంచీ: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ వీరవిహారంతో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 314 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఆసీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు 38 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ 85 బంతుల్లో 101 పరుగులు చేశాడు. కోహ్లీ 95 బంతుల్లో 123 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కూడా మొక్కవోని ధైర్యంతో ఒక్కొక పరుగు తీస్తూ ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. విరాట్ 41వ సెంచరీ చేశాడు. విరాట్ కంటే ముందు 49 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. వరుసగా రెండు వన్డేలో రెండు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు.