అభినందన్‌కు పరమ వీర్ చక్ర అవార్డు!

SMTV Desk 2019-03-08 19:56:28  indian airforce, wing commander abhinandan vardhaman, param veer chakra award, bjp, narendra modi, tamilnadu chief minister palaniswamy

చెన్నై, మార్చ్ 08: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దవాతావరణాలు నెలకొన్న సమయంలో పాక్ ఆర్మీకి చిక్కి ఇండియాకు తిరిగొచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు పరమ వీర్ చక్ర ఇవ్వాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు ఓ లేఖ రాశారు. అభినందన్‌కు పరమ్ వీర్ చక్ర ఇవ్వాలని ఆ లేఖలో మోడీని పళనిస్వామి కోరారు. తన ప్రతిపాదనపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగ్-21 యుద్ధ విమానం పాక్ విమానాన్ని వెంటాడుతూ కుప్పకూలింది. ఈ విమానం నుండి పైలట్ అభినందన్ సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డాడు. రెండు రోజుల తర్వాత అభినందన్ స్వదేశానికి తిరిగి వచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ తరుణంలో అభినందన్ కు పరమ్ వీర్ చక్ర అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ కూటమికి కలిసొచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.