మార్చ్ 08: స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ హువావే మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హువావే వై7 2019ను ఇవాళ చైనా మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.15,590 తో ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్లో హువావే కొన్ని కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు. హువావే వై7 2019 ఫీచర్లు... 6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.