ఉత్తరప్రదేశ్, ఆగష్ట్ 6: గత కొన్ని రోజులగా ఉగ్రవాదులపై భారత్ తనదైన శైలిలో పంజా విసురుతుంది. ఇటీవల కాశ్మీర్లో వరుసగా ఉగ్రవాదులను మట్టుపెడుతున్న సంగతి విదితమే. తాజాగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్)విదేశీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. యూపీ ఏటీఎస్ వివరాల ప్రకారం స్థానిక ముజఫర్నగర్లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన అన్సారుల్లా విదేశీయులు భారత్లోకి ప్రవేశించేందుకు వీలుగా నకిలీ గుర్తింపు కార్డులను అందిస్తున్నట్టు పేర్కోన్నారు. అన్సారుల్లా బంగ్లా గ్రూప్కు చెందిన ఉగ్రవాదిగా గుర్తించి, అతని ఫోటోను మీడియాకు విడుదల చేసింది.