మరో అరుదైన రికార్డు కి చేరువలో కోహ్లీ

SMTV Desk 2019-03-08 17:55:23  Kohli,

హైదరాబాద్, మార్చ్ 08: భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన మైలు రాయిని చేరుకోవడానికి అతి దగ్గర్లో ఉన్నాడు. నాగ్‌పూర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్టేలో సెంచరీ బాది, జట్టు‌ విజయంలో విరాట్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ రోజు రాంచీలో జరగనున్న మూడో వన్టేలో కోహ్లీ మరో 27 పరుగులు సాధిస్తే వన్టేల్లో కెప్టెన్‌గా ఉండి 4000 పరుగులు సాధించిన 12వ క్రికెటర్‌గా రికార్టులకెక్కనున్నాడు. దీంతో పాటు వన్టేల్లో నాలుగు వేల పరుగులు సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కనున్నాడు. కోహ్లీ కంటే ధోని(6641), అజారుద్దీన్‌(5239), గంగూలీ(5104) ముందువరుసలో ఉన్నారు.

ఇక పోతే మూడో వన్టేలో భారత్ గెలిస్తే, 50 ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా పై భారత్‌కు ఇది 50వ విజయం అవుతుంది. కోహ్లీ కెప్టెన్‌గా వన్టేల్లో 82.77 సగటుతో కొనసాగుతున్నాడు.

హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ మ్యాచ్‌లను నెగ్గిన భారత్, రాంచీ మ్యాచ్‌లో కూడా నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఉర్రూతలూగుతోంది.