బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి విదితమే . ఈ నిషేధం ఈ నెల మార్చి 28తో ముగియనుంది. వీరి నిషేధం ముగిసిన తర్వాత పాకిస్థాన్తో జరిగే ఐదు వన్డేల సిరీస్తో ఈ ఇద్దరూ పునరాగమనం చేస్తారని అందరూ భావించారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దర్ని తీసుకోలేదు ..
అయితే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు గాయాల నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టారని, వారి పునరాగమనానికి ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) సరైనదిగా భావిస్తున్నారని ఆ జట్టు సెలక్షన్ ఛైర్మెన్ ట్రెవెర్ హాన్స్ తెలిపారు.
ఐపీఎల్ను ప్రపంచ దిగ్గజాలు పాల్గొనే ఓ అత్యుత్తమైన టోర్నీగా అభివర్ణించారు.ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతుండగా... స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. వరల్డ్కప్, యాషెస్ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని వారి ఆటను పరిశీలిస్తామన్నామని ట్రెవెర్ హాన్స్ తెలిపాడు.