లక్నో, మార్చ్ 08: ఉత్తరప్రదేశ్ లో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రోజు సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. కాగా పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ ఈ సారి మెయిన్పురి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కజిన్స్ ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్లకు ఈ సారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న బదౌన్(ధర్మేంద్రయాదవ్), ఫిరోజాబాద్(అక్షయ్ యాదవ్) నుంచే వీరు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇత్వా నుంచి కమలేశ్ కథారియా, రాబర్ట్స్గంజ్ నుంచి భాయిలాల్ కోల్, బహ్రాయిచ్ నుంచి షబ్బీర్ వాల్మికి పేర్లు ఖరారయ్యాయి.