హైదరాబాద్, మార్చ్ 08: విశ్వనటుడు కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ’పాపనాశం‘. ఈ సినిమాలో కమల్ కూతురుగా హీరోయిన్ నివేదా థామస్ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో బిజీగా ఉన్నారు. తెలుగు అగ్రహీరోలతో ఆమె జతకడుతున్నారు. ప్రస్తుతం నివేదా థామస్ మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. నివేదా థామస్కు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే తాను ఎంచుకుంటున్నట్టు ఆమె తెలిపారు. తాను తన తోటి హీరోయిన్లతో పోటీ పడడం లేదని, హీరోలే తనకు పోటీ అని ఆమె పేర్కొన్నారు. హీరోల మాదిరిగా బలమైన పాత్రల్లో నటించే సత్తా తనకు ఉందని నివేదా థామస్ స్పష్టంచేశారు. హీరోలతో పోల్చే స్థాయికి తాను వస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నివేదా థామస్ నటిస్తున్నారు.