అక్కడి పార్టీ శ్రేణులు పొత్తులకు వ్యతిరేకం!

SMTV Desk 2019-03-08 12:33:42  Rahul Gandhi, Aravind Kejriwal, AAP, Congress, Alliance, Delhi, Lok Sabha Polls

న్యూఢిల్లీ, మార్చి 8: కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకొని కూటమిగా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది. దాదాపు అన్ని రాష్రాల్లో కాంగ్రెస్ పొత్తులో ఉంది, ఒక ఢిల్లీలో తప్ప. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని, కానీ ఢిల్లీలోని పార్టీ శ్రేణులు మాత్రం పొత్తులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందువల్లే ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగనుంది అని రాహుల్ స్పష్టం చేశారు. కాగా, జాతీయ స్థాయిలో కూటమి, పొత్తులు మాత్రం ఉంటాయని తెలిపారు.