ఏపీ రూపురేఖలు మారుస్తా .

SMTV Desk 2019-03-08 12:29:31  ap, ap elections,

అమరావతి, మార్చ్ 08: ఎప్పటికి వార్తల్లో నిలిచిపోయే ప్రజాశాంతి పార్టీ అద్యక్ష్యుడు కేఏ పాల్ మరోసారి సంచలనాలకు తెరతీశాడు. రాబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే మాత్రం ఏపీ రూపురేఖలు అన్ని మారుస్తానని, ఏపీని మరో అమెరికా చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజల్లో తమకు ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో తానూ సీఎం కావడం ఖాయమని పాల్ అన్నారు. అంతేకాకుండా ఎన్నికల ఓకాసం తానూ ప్రత్యేకంగా 3 హెలీకాఫ్టర్లని బుక్ చేసుకున్నాడని, ఏప్రిల్ మొదటివారం నుండి ఒక్క రోజుకు కనీసం ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు.

కాగా వైసీపీ అధినేత జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు పాల్. తమకి సంబందించిన ఇరు పార్టీల గుర్తులు ఒకేలా ఉంటె ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని, జగన్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని పాల్ ఆరోపించారు.