యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం బాలాలయాన్ని సంప్రదాయంగా ముస్తాబు చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించిన తొలి పూజతో ఉత్సవ పర్వాలు ఆవిష్కృతమయ్యాయి. శుక్రవారం రాత్రి సంప్రదాయ పర్వాల మధ్య అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇఒ తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులు జరిపించే నిత్యహోమం, కల్యాణోత్సవ పర్వాలను రద్దు చేశామని ఆయన వెల్లడించారు.