న్యూఢిల్లీ, మార్చి 8: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కాన్పూర్, ఘజియాబాద్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొదటగా తను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత అక్కడి అప్రోచ్ రోడ్కు శంకుస్థాపన చేసి, ఆలయానికి వచ్చే రోడ్డు ప్రాజెక్టును మరింత పటిష్టపరిచారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయం మరింత శోభాయమానంగా మారనుంది. ప్రాజెక్టు సైట్ను పరిశీలించిన మోదీ, అక్కడి దీన్ దయాళ్ హస్తకళా సంకుల్లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా జీవన విధాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.