నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకుని సజీవదహనం

SMTV Desk 2019-03-08 12:15:17  Suicide, Fire, Lose in Business, Investigation

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతను అక్కడే సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సనత్ నగర్ లోని స్నేహపురి కాలనీలో ఉదయం 7 గంటల సమయంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే .... కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న ఆ వ్యక్తికి తీవ్ర నష్టం రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆత్మహత్య కు పాల్పడట్టు తెలుస్తుంది. ఆయన సజీవ దహనమవుతున్న దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.