న్యూఢిల్లీ, మార్చ్ 07: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును, కాగ్ను నమ్మరని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రఫెల్ డీల్ లో మోడీని విచారించాలన్న రాహుల్ డిమాండ్పై ఘాటుగా స్పందించిన రవిశంకర్ ప్రసాద్ రాహుల్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భారత వాయుసేనపై కాంగ్రెస్ అధినేతకు విశ్వాసం లేదన్న రవిశంకర్ ప్రసాద్ ఆయన ఎవరిని నమ్ముతారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ ఉద్దేశపూర్వకంగా రఫేల్ పోటీదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు.