శ్రీనగర్, మార్చ్ 07: జమ్మూకాశ్మీర్ లో ఈ రోజు ఉదయం గ్రానైడ్ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కాగా ఈ దాడిలో 18 మందికి గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా..ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.