వైసీపీ పార్టీ కి కొత్త పేరు పెట్టిన టీడీపీ నేత

SMTV Desk 2019-03-07 17:12:36  ycp party, venkanna

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాటు తాజాగా ఓటర్ల డేటా తొలగింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్క సరిగా వేడెక్కాయి.మీరు చేసారంటే మీరు చేసారు అంటూ తెలుగుదేశం మరియు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.అందులో భాగంగానే రకరకాల విమర్శలు చేసుకుంటున్నారు.వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి టీడీపీ నేతలకు మరియు ఆ పార్టీకి వింత వింత పేర్లు సరికొత్త కొత్త పేరు పెడుతుంటే ఉప్పుడు టీడీపీ నేతలు జగన్ పార్టీకి కొత్త పేర్లు పెడుతున్నారు.రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరి మీద ఒకరు ఏ స్థాయిలో మాటల తూటాలు విసురుకుంటారో అందరికి తెలుసు.

గత కొన్ని రోజులు క్రితం జగన్ కేటీఆర్ ను కలవడం అలాగే కెసిఆర్ సర్కార్ కూడా ఏపీ లో జగన్ కే సపోర్ట్ చెయ్యడం వంటివి చెయ్యడంతో తెలుగు తమ్ముళ్లు మరింత స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్ యొక్క వైసీపీ పార్టీకి ఒక సరికొత్త పేరు ని పెట్టారు.రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంతా మళ్ళీ చంద్రబాబుకే పట్టం కట్టనున్నారని జగన్ కి అర్ధమయ్యిందని అందుకే జగన్ కెసిఆర్ మరియు కేటీఆర్లు కలిసి కుట్రలు పన్ని చంద్రబాబును అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చెయ్యాలని చూస్తున్నారని.అందువల్ల ఇప్పుడు జగన్ ది వైసీపీ పార్టీ కాదు కెసిఆర్ తో కాలిపోయిన కేసీపీ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేసారు.