ఆకట్టుకునే రేంజ్ లో చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్

SMTV Desk 2019-03-07 16:45:52  Chitra Laharai, Sai Dahram Tej

హైదరాబాద్, మార్చ్ 07: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఈ ప్రేమకథా చిత్రంలో కథానాయికలుగా హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఆరంభించారు.

ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 6 సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల లోపే జరగవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ హక్కుల ధర తెలియాల్సి వుంది. దర్శకుడిగా కిషోర్ తిరుమలపై గల నమ్మకంతో ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అయినా సాయిధరమ్ తేజ్ కి విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.