పెన్షన్ కోసం వచ్చిన మహిళపై.. ఎమ్మెల్యే రేప్

SMTV Desk 2019-03-07 13:59:45  rape,

పెన్షన్ కోసం వచ్చిన మహిళను ఎమ్మెల్యే అత్యాచారం చేయడం ఢిల్లీలో సంచలనం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ ఓ మహిళను అత్యాచారం చేశారన్న సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రితాలా నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనపై అత్యాచారం చేశాడని ప్రశాంత్ విహార్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ప్రశాంత్ విహార్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 509 ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసు విభాగంలో మహిళాసెల్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. గతేడాది డిసెంబరులో ఓ మహిళ తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ మొహిందర్ గోయల్‌ను సంప్రదించగా ఆయన ఆమెపై అత్యాచారం చేశాడు. మళ్లీ నెలరోజుల తర్వాత ఎమ్మెల్యే మొహిందర్ అదే మహిళపై తన కార్యాలయంలోనే అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.