న్యూఢిల్లీ, మార్చి 7: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియా తనయుడు, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వార్గియా ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ గధోం కా సర్తాజ్ (గాడిదలకు నాయకుడి)గా మారారని దేశ ద్రోహిల వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గతంలో రాహుల్గాంధీని పప్పు అని పిలిచేవారు. అది పెద్దగా హాని చేయని, ప్రేమగా పిలుచుకునే పేరు. కానీ, ఇప్పుడు ఆయన దేశద్రోహిలా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆయన పేరు పప్పు నుంచి గధోంకా సర్తాజ్గా మారింది" అంటూ మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.