బ్రేకింగ్ .. జమ్మూ బస్టాండ్‌ లో పేలుడు

SMTV Desk 2019-03-07 13:37:45  jammu bastand, bomb

జమ్మూకాశ్మీర్‌ లో గ్రానైడ్‌ పేలుడు జరిగింది. జమ్మూలోని ప్రధాన బస్టాండ్‌ లో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఘటనతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం బాంబు దాడి చేసిన స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. జమ్మూ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబును పేల్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.