స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి 5జీ వచ్చేసింది. ఇంతకాలం 4జీ వాడుతున్న వినియోగదారులకు ఇక 5జీ తో ఇంటర్నెట్ మరింత వేగం కానుంది. తాజాగా 5జీ నెట్వర్క్పై పనిచేసే ప్రీమియం స్మార్ట్ఫోన్లను ప్రపంచ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సౌత్ కొరియా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. శాంసంగ్ తన 5జీ స్మార్ట్ఫోన్లను ఏప్రిల్ మొదటి లేదా చివరి వారంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ 5జీ నెట్ వర్క్ పై కొన్ని సాంకేతిక లోపాలు ఉండడం వల్ల.. వాటిని ఇంకా బాగు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన శాంసాంగ్ గెలాక్సీ ఎస్ 10 లో 5జీ నెట్వర్క్ను ఏప్రిల్ నెలలో తీసుకొచ్చేందుకు అవకాశాలున్నాయని శాంసాంగ్ ప్రతినిధులు తెలిపారు. మరో బ్రాండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ V50 థిక్యూ(LG ThinQ) ను ఏప్రిల్ లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.