ఇస్లామాబాద్, మార్చి 7: పాకిస్తాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే మహమ్మద్ ను వాడుకుంటూ, భారత పై దాడులు చేయిస్తుందని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి చెందినా విలేకరు నదిమ్ మాలిక్ కు టెలిఫోన్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను పరిపారించిన సమయంలో ఐఎస్ఐ, జైషే మహమ్మద్ తోనే దాడులు చేయించిందని, ఆ సమయంలో జైషే తనపై రెండు సార్లు హత్యా చేయడానికి ప్రయత్నించి విఫలమైందని అన్నారు. కాగా విలేకరు... అలాంటి సమయంలో మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ, పర్వేజ్ ముషారఫ్ నాటి పరిస్థితులు చాలా భిన్నమైనవని, అప్పట్లో భారత్ పాక్ మధ్య రహస్య పోరాటాలు ఉండేవని అన్నారు. జైషేపై చర్యలు తీసుకోవాలని తాను కూడా ఎటువంటి ఒత్తిడిని తీసుకు రాలేదని చెప్పారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.