రాంచి మైదానంలో చివరి మ్యాచ్ ఆడనున్న ధోని ... విడ్కోలుకు భారీ ఏర్పాట్లు ..

SMTV Desk 2019-03-07 12:33:18  Ms Dhoni ..

రాంచి, మార్చ్ 07: జార్ఖండ్ రాజధాని రాంచీలో రేపు ఆస్ట్రేలియాతో మూడో వన్డే జరుగనుండగా, మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి తన హోమ్ గ్రౌండ్ లో ఇదే చివరి మ్యాచ్ కావచ్చని తెలుస్తోంది. రేపటి మ్యాచ్ తరువాత, రాంచీలో మరో మ్యాచ్ జరగాలంటే, ఇంకో ఏడాదిన్నర సమయం వరకూ పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్ మెంట్ ను ప్రకటించిన మహి , రానున్న వరల్డ్ కప్ కోసమే వన్డేల్లో కొనసాగుతున్నాడు.ధోని నిలకడగా రాణిస్తూ, జట్టులోని అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, కెప్టెన్ కోహ్లీకి సలహాలు, సూచనలు ఇస్తున్నాడు , ప్రపంచకప్ తరువాత వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. అదే జరిగితే, రేపటి మ్యాచ్ రాంచీలో ధోనీ ఆడే చివరి వన్డే అవుతుంది. ఇక ఇదే విషయాన్ని నమ్ముతున్న రాంచీ ప్రజలు, తమ అభిమాన ఆటగాడికి సొంత మైదానంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.