నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు దుర్మరణం

SMTV Desk 2019-03-07 12:17:04  nalgonda road accident, bolero hits rtc bus, seven members died

నల్గొండ, మార్చ్ 06: బుదవారం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం... కొండమండేపల్లి మండలం దేవతూపల్లి వద్ద దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న బోలేరో వాహనం ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొన్నది. బోలేరో వాహనం టైర్ పంచర్ కావటంతో ఈ ప్రమాదం సంభవించింది. వాహనంలో ఉన్న ఏడుగురు మృతిచెందగా.. ఆర్టీసీ బస్సులోని 15మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.