ఆఫ్ఘనిస్థాన్, మార్చ్ 06: ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జలాలాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ నిర్మాణ కంపెనీ వద్ద చోటు చేసుకున్న ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడితో జలాలాబాద్ అమెరికా సైనికుల చేతుల్లోకి వెళ్లింది.