భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు, ఓ ఉగ్రవాది హతం

SMTV Desk 2019-03-07 11:52:33  Indian Soldiers, Pakistan Terrorist, One Terrorist Killed, Boarder

శ్రీనగర్, మార్చి 7: గత నెల 14న పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి తరువాత ఇండియా-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని హంద్వారాలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. హంద్వారా సమీపంలోని క్రాల్‌గండ్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి భద్రతా దళాలు. వీరిపై ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరుపగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసీ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయని అధికారులు పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో జమ్మూ కశ్మీర్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్‌ కావడం విశేషం.