శ్రీనగర్, మార్చ్ 06: భారత సరిహద్దులో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. సరిహద్దులోని రజౌరీ పట్టణంలో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు చేశారు. మోటార్ షెల్స్తో దాడులు చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. దీంతో సరిహద్దులోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుందర్ బానీ, కృష్ణఘటి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరుపగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టంది. పాక్ చేస్తున్న దాడులను భారత సైన్యం ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కుంటూనే ఉంది.