ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

SMTV Desk 2017-08-06 10:45:29  air india, passingers, mumbai, delhi,

ముంబై, ఆగస్ట్ 6 : సాంకేతిక లోపం కారణంగా ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులు దాదాపు నాలుగు గంటల పాటు ఎదురుచూడవలసి వచ్చింది. ఎఐ-809 విమానంలో నిన్న సాంకేతిక లోపం తలెత్తింది. కనీసం దానిలో ఎయిర్ కండిషన్ కూడా సరిగా లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. పైగా ముంబై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం సుమారు మూడు గంటలకు పైగా ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 11:30 బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కాగా ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ముంబై-ఢిల్లీ జెడ్డా విమానం ఆలస్యానికి కారణాలేంటో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్టు ఆయన వివరించారు.